Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
మామడ మండలంలోని న్యూ లింగంపల్లి గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా పారంపండు నూతన నిర్మాణం చేపట్టేందుకు యకారం మౌనిక–సురేష్ పట్టా భూమిలో గురువారం భూమిని గుర్తించి సరిహద్దులను నిర్ధారించారు. అధికారులు పనులను నాణ్యతతో, గడువులో పూర్తి చేయాలని సూచించారు.
మామడ మండలంలోని న్యూ లింగంపల్లి గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా పారంపండు నూతన నిర్మాణం చేపట్టేందుకు యకారం మౌనిక–సురేష్ పట్టా భూమిలో గురువారం భూమిని గుర్తించి సరిహద్దులను నిర్ధారించారు.
ఈ సందర్భంగా పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగన్న, ఉపసర్పంచ్ సాయన్న, మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది రవి, క్షేత్ర సహాయకుడు రాజలింగం, కె. రాజేశ్వర్, వై. మహేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.












