పెంబి, జూలై 7
ఆదివాసులు సాగు చేస్తున్న పోడు పట్టా భూముల్లో అటవీశాఖ చేపడుతున్న రీ-సర్వేను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెంబి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఆదివాసులు సాగు చేస్తున్న పోడు పట్టా భూముల్లో అటవీశాఖ చేపడుతున్న రీ-సర్వేను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పెంబి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే పోడు భూములకు హక్కు పత్రాలు జారీ చేసినప్పటికీ, అదే భూముల్లో అటవీశాఖ అధికారులు రీ-సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. భూముల్లో చెట్లు, పొదలు పెరిగిన కారణంగా వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
పట్టాలు పొందని పోడు భూములను సర్వే చేసి అర్హులైన గిరిజనులకు వెంటనే హక్కు పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పట్టాలు ఉన్న భూముల్లో రీ-సర్వే నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజలు ఈ ప్రక్రియకు సహకరించవద్దని పిలుపునిచ్చారు.
ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రజా సంఘాల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ దుర్గం నూతన్ కుమార్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసం శంభు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెల్లి నర్సయ్య, గిరిజన సంఘం మండల నాయకుడు ఆత్రం బాపూరావు, నాయకురాలు నిర్మలబాయి, కోసగుట్ట గ్రామ ఉపసర్పంచ్ కొమరం పగ్గు, నాగుల నర్సాగౌడ్, దత్తురాం, పెంద్రం జంగు, చాకటి జంగు, బాపు కాట్లే లింభారావు, తుడసం జుగత్రావు తదితరులు పాల్గొన్నారు.












