ముధోల్, 2026-06-05
ముధోల్ మండల కేంద్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ గణిత విజ్ఞాన, సంస్కృతి మహోత్సవం, రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్2026 పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ బహుమతులు అందజేశారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి నైతిక విలువలతో కూడిన విద్య అవసరమని ఆయన అన్నారు.
ముధోల్ మండల కేంద్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ గణిత విజ్ఞాన, సంస్కృతి మహోత్సవం, రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్2026 పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీల్లో గెలుపు, ఓటములు సహజమని, విద్యార్థులు గెలుపు కోసం నిరంతరం కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. నైతిక విలువలతో కూడిన విద్యాభ్యాసం విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడుతుందని, అలాంటి విలువలను అందించడంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.












