
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక శాఖ శుభవార్త అందించింది. జూలై 1వ తేదీనే వారి జీతాలను ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపింది. గతంలో జీతాల ఆలస్యంపై ఉద్యోగుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.



















