మిర్యాలగూడ, జూలై 1
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి రాజకీయ పార్టీలు ప్రజలను చైతన్య పరచి, తప్పులు లేకుండా ఎస్ఐఆర్ ఫారాలు జాగ్రత్తగా నింపేలా సహకరించాలని మిర్యాలగూడ ఆర్డీవో, ఓటర్ నమోదు అధికారి ఎస్.రమణారెడ్డి కోరారు. బుధవారం స్థానిక రెవిన్యూ డివిజన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన అఖిల పక్ష నాయకుల సమావేశంలో ఆయన ఈ మేరకు సూచించారు.
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి రాజకీయ పార్టీలు ప్రజలను చైతన్య పరచి, తప్పులు లేకుండా ఎస్ఐఆర్ ఫారాలు జాగ్రత్తగా నింపేలా సహకరించాలని మిర్యాలగూడ ఆర్డీవో, ఓటర్ నమోదు అధికారి ఎస్.రమణారెడ్డి కోరారు.
బుధవారం స్థానిక రెవిన్యూ డివిజన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన అఖిల పక్ష నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ నిర్వహించే ఎన్యూమరేటర్లకు ఆయా రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు అందుబాటులో ఉండి బిఎల్ఓలకు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో తహసీల్దార్ పి.శ్రీనివాస్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నాగమణి, కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ పాతురి శరత్, సిపిఎం నాయకులు ఎం.రవినాయక్, బిజెపి నాయకులు కన్మంతరెడ్డి అశోక్ రెడ్డి, సజ్జల నాగిరెడ్డి, టీజెఎస్ నాయకులు క్రాంతికుమార్, బిఎస్పి నాయకులు దినేష్, ఎస్కె గాలిబ్ లు పాల్గొన్నారు.









