
పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలోని కస్టమర్ సేవా కేంద్రంలో భారతీయ స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి భద్రత బీమా పథకం, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ పథకాల ద్వారా తక్కువ ప్రీమియంతో ప్రజలు బీమా రక్షణ పొందవచ్చని బ్యాంకు ప్రతినిధి ప్రవీణ్ తెలిపారు.



















