ఖానాపూర్, 20 July
ఖానాపూర్ పట్టణంలో ఇటీవల మృతి చెందిన పంబాల వినేష్, ఆగుట్ల రాకేష్ కుటుంబాలను, అలాగే గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న పంబాల రాజును బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన పంబాల వినేష్, ఆగుట్ల రాకేష్ ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను, అలాగే కాలుకు ఫ్యాక్చర్ అయి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న పంబాల రాజును బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పరామర్శించారు.
ఈ సందర్భంగా పంబాల రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారి కుటుంబాలకు ప్రసాదించాలని ప్రార్థించారు.












