
జీవిత సమస్యలను పరిశీలించడంలో తాను ఎప్పుడూ శాస్త్రీయ దృక్పథాన్నే అనుసరిస్తానని, 19, 20 శతాబ్దాల శాస్త్రజ్ఞానంపై తనకు అపారమైన విశ్వాసం ఉందని భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేర్కొన్నారు. పేచీలు లేని సుఖజీవనం, దారుఢ్యం, శక్తి, ఆత్మవిశ్వాసం వల్ల శాస్త్రజ్ఞానంపై తనకు నమ్మకం ఏర్పడిందని తెలిపారు. ఏ మతం కూడా తనను ఆకర్షించలేదని, హిందూమతం, క్రైస్తవమతం, ఇస్లాం, బౌద్ధమతం వంటివి ఆచార వ్యవహారాలు, మూఢనమ్మకాలతో నిండిపోయాయని, అందువల్ల అవి శాస్త్రీయ దృక్పథానికి దూరమని నెహ్రూ అభిప్రాయపడ్డారు.


















