బాసర, 21 July
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT), బాసర క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీయూసీ-1 విద్యార్థులకు స్టూడెంట్ వెల్ఫేర్ విభాగం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం, క్యాంపస్లోకి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు మాత్రమే ప్రవేశం కల్పించబడుతుంది.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT), బాసరలో 2026–27 విద్యా సంవత్సరం పీయూసీ-1 విద్యార్థులకు స్టూడెంట్ వెల్ఫేర్ విభాగం కీలక సూచనలు జారీ చేసింది. క్యాంపస్లోకి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, హాస్టళ్లలో పుట్టినరోజు వేడుకలు, ఫేర్వెల్ పార్టీలు, ఫొటోషూట్లు, అలాగే జంక్ ఫుడ్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులందరూ హాస్టల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.












