మిర్యాలగూడ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను రాబోయే వారం రోజుల్లోగా 80 శాతం పూర్తి చేయాలని ఆర్డీఓ ఎస్. రమణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 70 శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన పనిని వేగవంతం చేయాలని సూచించారు.
శుక్రవారం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓలతో ఆర్డీఓ రమణారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటికి తిరిగి పకడ్బందీగా మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టాలని, వారం రోజుల్లోగా 80 నుంచి 85 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు.
ప్రతిరోజూ చేపట్టిన మ్యాపింగ్ వివరాలను సంబంధిత అధికారులు తమకు తెలియజేయాలని ఆర్డీఓ ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు వంటి అంశాలపై దృష్టి సారించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ ప్రక్రియ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
సమీక్షా సమావేశంలో తహసిల్దార్లు పి. శ్రీనివాస్, జవహర్, రాగ్యానాయక్, ఎస్. సరోజ పావని, హేమలత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, సూపర్వైజర్లు, బిఎల్వోలు, తదితరులు పాల్గొన్నారు.











