
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఉపయోగించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుతూ అధిక పంటలు సాగు చేస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. నేడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ నుండి పంట సాగు కోసం వరద కాలువ ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయించారు.



















