
మిర్యాలగూడ మండలంలోని హాట్యా తండా గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో, జాతీయ మాంస పశు పరిశోధనా సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, పశుపాలకుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.



















