
నిర్మల్ జిల్లా బాసరలో శ్రీశ్రీశ్రీ దశరథ మహారాజు పుణ్యతిథి సందర్భంగా ఓం శ్రీ వరలక్ష్మి ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. గోదావరి నది పుష్కర మొదటి ఘాట్ వద్ద అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆశ్రమ ఉత్తరాధికారి నర్సూరి శ్రీనాథ్ రావు ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ చేశారు.



















