
తెలంగాణలో ఎరువులను రైతులకు సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఫెర్టిలైజర్ లైసెన్సులు ఇచ్చి, ఎరువుల పంపిణీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

తెలంగాణలో ఎరువులను రైతులకు సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఫెర్టిలైజర్ లైసెన్సులు ఇచ్చి, ఎరువుల పంపిణీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

జిల్లా స్థాయి అండర్-14 బాలుర విభాగం అథ్లెటిక్ అసోసియేషన్ సెలక్షన్ లో పోచంపల్లి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ ఎంపిక ప్రక్రియ నిజామాబాద్ డిఎస్ఏ గ్రౌండ్ లో సోమవారం (6-7-2026) నాడు జరిగింది. రాష్ట్ర స్థాయి క్రీడలు ఈ నెల 11, 12 తేదీలలో సిద్దిపేటలో జరగనున్నాయి.

తానూరు మండలంలోని బొంద్రట్ గ్రామంలో గురువారం ఇందిరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిందే రవీంద్ర పటేల్ రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించారు.

హైదరాబాద్లోని శంషాబాద్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సతమరాయి సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బస్టాండ్లో వేచి ఉన్న మహిళలపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి.

నిర్మల్ జిల్లా బాసర మండలానికి చెందిన ఒక వ్యక్తి హోటల్లో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజంతా పొయ్యి పొగ, వేడి మధ్య శ్రమిస్తూ, వంటలు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం, వినియోగదారులకు సేవలు అందించడం వంటి పనులు చేస్తూ కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నాడు.

మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం ఈ తెల్లవారుజామున వరుస భూప్రకంపనలతో వణికిపోయింది. నాందేడ్, హింగోలి, పర్భణి జిల్లాల్లో భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:37 గంటలకు 3.6 తీవ్రతతో తొలి ప్రకంపనలు నమోదు కాగా, వేకువజామున 3:23 గంటలకు 4.1 తీవ్రతతో మరో ప్రకంపన వచ్చింది.

450 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ హుస్సేన్ సాగర్, నేడు తీవ్ర కాలుష్యంతో సతమతమవుతోంది. రోజుకు 2.5 కోట్ల లీటర్ల మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు నేరుగా సరస్సులోకి చేరడంతో నీరు విషతుల్యంగా మారుతోంది. ఆక్రమణలు, నిమజ్జనం వంటి సమస్యలు కూడా దీనికి తోడయ్యాయి.

రాష్ట్రంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, USFI నిర్మల్ జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ జూలై 10న "చలో ప్రజా భవన్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు.

తెలంగాణ ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) కీలక స్పష్టత ఇచ్చారు. 'SIR-2026' ఎన్యూమరేషన్ ఫామ్ను ఆన్లైన్లో విజయవంతంగా సబ్మిట్ చేసిన ఓటర్లు, మళ్లీ బీఎల్ఓ (BLO)లకు ఫిజికల్ పేపర్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

పశ్చిమబెంగాల్లో సంచలనం రేపిన బాలికపై అత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసు విచారణలో భాగంగా ఘటనాస్థలికి తరలించిన ప్రధాన నిందితుడు, పోలీసుల నుండి తుపాకీ లాక్కుని కాల్పులు జరపడంతో, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

పక్కింటి దంపతుల మత మార్పిడి ఒత్తిడి, పెట్టుబడి పేరుతో రూ.20 లక్షలు మోసం చేయడంతో రవికుమార్, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్కేసర్లో చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసుల విచారణలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్, విద్వాన్స్ అనే ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవిస్తున్న ఈ కుటుంబాన్ని పక్కింటి వెంకట్, ప్రమీల దంపతులు మతం మార్పిడి పేరుతో వేధించినట్లు సమాచారం.

మిర్యాలగూడ జూలై 9 (మనోరంజని తెలుగు టైమ్స్)

ఓట్లు కొల్లగొట్టడానికి, బడ్జెట్ను బొక్కా చేయడానికి రాజకీయ పార్టీలు ఆడుతున్న "ఉచిత పథకాల" ఆటపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. "జడ్జీలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది" అని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని, ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

మిర్యాలగూడ పట్టణాన్ని పరిశుభ్రంగా, సమస్యల రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ బుధవారం 44, 46, 48వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పరిస్థితులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

మిర్యాలగూడ మండలంలోని నాలుగు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలలో యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మేకల ఋష్యేంద్రమణి తెలిపారు. బుధవారం ఆలగడప పిఎసిఎస్ లో యూరియా నిల్వలను ఆమె తనిఖీ చేశారు.

పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని, భరోసాను కలిగించాలని ఆమె సూచించారు. బుధవారం స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ను ఆమె సందర్శించారు.

వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిల్లల వైద్య నిపుణులు డా. దయానంద్ రెడ్డి సూచించారు. ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు అందించారు.

కుబీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో జరిగిన పోక్సో కేసులో నిందితుడు బనెల్లి విఠల్కు నిర్మల్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10,000 జరిమానా విధించింది. ఈ కేసులో పోలీసులు, ప్రాసిక్యూషన్ కీలక ఆధారాలను సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా చేశారని ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు.

చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల భీమారం మండలం, కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేశారు. ఎనిమిదవ వార్డులో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఫారాలను నింపారు.

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణ, డీఆర్డీఓ, జిల్లా పంచాయతీ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు.