
ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్) ఫారాలను పూరించడంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (బిఎల్ఓలు) అప్రమత్తంగా వ్యవహరించాలని మిర్యాలగూడ రెవిన్యూ డివిజనల్ అధికారి, ఓటర్ నమోదు అధికారి ఎస్. రమణారెడ్డి ఆదేశించారు. స్థానిక డివిజన్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు బిఎల్ఓల పనితీరుపై ఆరోపణలు చేశారు. దీనికి స్పందిస్తూ ఆర్డిఓ పలు సూచనలు చేశారు.



















