
గూడులేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసిందని ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గంగారెడ్డి అన్నారు. ఆదివారం ముధోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో లంబాడి శ్రీలత సాయినాథ్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.



















