
లోకేశ్వరం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం జరిగింది. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత, చేనులో ఫామ్ పాండ్ ఏర్పాటు లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు.


















