రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధతో రాకం నరేష్ (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
లారీ వ్యాపారం నిర్వహిస్తున్న నరేష్, వ్యాపారంలో నష్టాలు రావడంతో తీవ్ర అప్పుల భారం పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల బాధను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం తన ఇంటి పడక గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
మృతుడి తండ్రి రాకం రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనపై బోయినపల్లి ఎస్సై ఎన్. రమాకాంత్ మాట్లాడుతూ, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.












