ఖానాపూర్, జూలై 24
ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డులో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ క్షేత్రస్థాయిలో పర్యటించి, వార్డులోని సమస్యలను పరిశీలించారు. కౌన్సిలర్ మేస పోసమ్మ, నాయకుడు మేస సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డులో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ క్షేత్రస్థాయిలో పర్యటించి, వార్డులోని సమస్యలను పరిశీలించారు.
ఐదో వార్డు కౌన్సిలర్ మేస పోసమ్మ, నాయకుడు మేస సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో వార్డులో నెలకొన్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై వెంటనే స్పందించిన కమిషనర్, సంబంధిత అధికారులను పిలిపించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, యువజన సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











