జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అక్రిడిటేషన్ కార్డుల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
కొంత మంది వ్యక్తులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందింది.
ప్రభుత్వం ఉచితంగా అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తుందని, డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
అక్రిడిటేషన్ కార్డుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే, జిల్లా పౌరసంబంధాల అధికారి లేదా జిల్లా కలెక్టర్కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.












