ఖానాపూర్, జూలై 26
ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు పుష్కలంగా పండాలని కోరుతూ చిన్నారులు కప్పతల్లి ఆటలు ఆడారు. గ్రామ ప్రజల సుభిక్షం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.
ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, వానదేవుడు కరుణించి పాడిపంటలు పుష్కలంగా పండాలని కోరుతూ చిన్నారులు కప్పతల్లి ఆటలు ఆడారు. గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఆటను నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులు గ్రామంలోని పలు వీధుల్లో డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కప్పతల్లి ఆటలు ఆడగా, మహిళలు బిందెలతో నీటిని వారిపై పోసి అభిషేకం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామంలో పాడిపంటలు కళకళలాడాలని చిన్నారులు, గ్రామస్తులు ఆకాంక్షించారు.











