.లోకల్ కేబుల్ న్యూస్ అంతర్ముఖం సిల్వర్ జూబ్లీ వేడుకలలో సీనియర్ జర్నలిస్ట్ అస్లంకు సన్మానం :
మిర్యాలగూడ జులై 25 (మనోరంజని తెలుగు టైమ్స్)
లోకల్ కేబుల్ వార్తలు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అంతర్ముఖం సిల్వర్ జూబ్లీ- 2026 వేడుకలు శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్ సమావేశం హాల్లో అంతర్ముఖం నిర్వాహకులు, చైర్మన్ మర్రి ఎలియాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు ఖాజ హామీదుద్దీన్, నాగయ్య లకు ఘనంగా సన్మానించారు. సీనియర్ జర్నలిస్ట్ ఎండి అస్లంకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అంతర్ముఖం చైర్మన్ ఎలియాస్ లు, శాలువా కప్పి, మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలు, వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దిరావత్ స్కైలాబ్ నాయక్, డాక్టర్ రాజు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మోసిన్ అలీ, తెలంగాణఉద్యమకారుడు ప్రభాకర్ కస్తూరి, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు, కౌన్సిలర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, చిలుకూరి బాలకృష్ణ గుడిపాటి నవీన్ కుమార్, అయూబ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, హెచ్. డబ్ల్యు.పి.ఎల్. సంస్థ ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు, పాల్గొన్నారు.












