మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 06
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ జాతీయ కవి, రచయిత, అనువాదకుడు డా. పెరుక రాజుకు ప్రతిష్ఠాత్మక సర్వేపల్లి రాధాకృష్ణ సాహితీ అనువాద పురస్కారం2026ను ప్రదానం చేశారు. భారతీయ భాషల మధ్య సాహిత్య భావాలను, సంస్కృతులను అనుసంధానిస్తూ ఆయన చేస్తున్న విశిష్ట అనువాద సేవలకు, సామాజిక స్పృహతో కూడిన సాహిత్య కృషికి గుర్తింపుగా ఈ పురస్కారంతో సత్కరించారు.
సైనికుడిగా దేశసేవ చేస్తూనే, సాహితీవేత్తగా భాషల మధ్య భావవారధిగా నిలుస్తున్న డా. పెరుక రాజుకు ప్రతిష్ఠాత్మక సర్వేపల్లి రాధాకృష్ణ సాహితీ అనువాద పురస్కారం2026 దక్కింది. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కళా సాంస్కృతిక ఫౌండేషన్, మన సినిమా చాంబర్ తెలంగాణ, నవభారత్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం పురస్కార ప్రదానోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ జాతీయ కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు, బహుభాషావేత్త డా. పెరుక రాజుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారతీయ భాషల మధ్య సాహిత్య భావాలను, సంస్కృతులను అనుసంధానిస్తూ ఆయన చేస్తున్న విశిష్ట అనువాద సేవలకు, సామాజిక స్పృహతో కూడిన సాహిత్య కృషికి గుర్తింపుగా ఈ పురస్కారంతో సత్కరించారు.
కూలీరైతు కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన డా. పెరుక రాజు ప్రస్తుతం భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా దేశానికి సేవలందిస్తున్నారు. సైనిక బాధ్యతలను నిర్వర్తిస్తూనే కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడిగా సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే 13 సాహితీ సంపుటాలను వెలువరించిన ఆయన, తెలుగు, ఆంగ్లంతో పాటు పలు భారతీయ భాషల సాహిత్యాన్ని పరస్పరం పరిచయం చేస్తూ భాషల మధ్య భావవారధిగా నిలుస్తున్నారు. ఆయన రచనల్లో దేశభక్తి, మానవత్వం, సామాజిక బాధ్యత, శ్రమజీవుల జీవన వాస్తవికత, సాంస్కృతిక ఐక్యత ప్రతిఫలిస్తాయి.
సాహిత్యంతో పాటు సామాజిక సేవలోనూ డా. రాజు తనదైన సేవలను కొనసాగిస్తున్నారు. ప్రోత్సాహమే గొప్ప బహుమతి అనే ఆశయంతో మై గిఫ్ట్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, ప్రతిభావంతులను ప్రోత్సహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాదిలోనే డా. పెరుక రాజు పలు సాహితీ పురస్కారాలు, గౌరవాలను అందుకున్నారు. ఇటీవల ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఎథిక్స్ జీవితకాల సభ్యత్వం కూడా ఆయనకు లభించింది. ఆంగ్ల పత్రికల్లో సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు, కాలమ్స్ రాస్తూ తన సాహిత్య చింతనను విస్తృత పాఠకలోకానికి చేరువ చేస్తున్నారు.
పురస్కారం అందుకున్న అనంతరం డా. పెరుక రాజు మాట్లాడుతూ, ఈ గౌరవం నాది మాత్రమే కాదు. భాషల మధ్య గోడలు కాకుండా వారధులు నిర్మిస్తూ, మానవత్వాన్ని నమ్మి అక్షరాన్ని సృజించే ప్రతి సాహితీవేత్తకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. అనువాదం అంటే కేవలం పదాలను మరో భాషలోకి తీసుకెళ్లడం కాదు; ఒక హృదయాన్ని మరో హృదయానికి చేరవేయడం అని పేర్కొన్నారు.












