లోకేశ్వరం, 2026-06-05
లోకేశ్వరం లోని వేదం పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు, వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా లోకేశ్వరం లోని వేదం పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి కవిత బి. పోశెట్టిని, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ జి. పోశెట్టిని వేదం పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ డి. రమేష్, శ్రీ రవీందర్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొని, సన్మానితులను అభినందించారు. తెలుగు భాష గొప్పతనాన్ని, క్రీడల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేస్తూ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.












