నిర్మల్, 2026-08-31
సోన్ మండలంలోని గాంధీనగర్ గ్రామ ప్రజలు, సర్పంచ్ బోయి రుసుంకుంటే ఆమని బస్వరాజ్ ఆధ్వర్యంలో సోన్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నోడల్ అధికారి, ఎంపీడీవోకు గ్రామంలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఈ వినతి పత్రంలో ప్రధానంగా ప్రస్తావించారు.
సోన్ మండలంలోని గాంధీనగర్ గ్రామ ప్రజలు, సర్పంచ్ బోయి రుసుంకుంటే ఆమని బస్వరాజ్ ఆధ్వర్యంలో సోన్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నోడల్ అధికారి, ఎంపీడీవోకు గ్రామంలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఈ వినతి పత్రంలో ప్రధానంగా ప్రస్తావించారు.
గాంధీనగర్ గ్రామానికి ప్రస్తుతం ఉన్న విద్యుత్ కనెక్షన్ పాక్ పట్ల సబ్ స్టేషన్ నుండి పంట పొలాల మీదుగా, తోటలలో దాదాపు అయిదారు కిలోమీటర్ల దూరం నుంచి వస్తోంది. ఈదురుగాలు, చిన్నపాటి వర్షం పడటం వల్ల తరచుగా కరెంటు పోతుంది. దీనితో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కావున గాంధీనగర్ గ్రామానికి పాక్ పట్ల సబ్ స్టేషన్ నుండి లెఫ్ట్ పోచంపాడు మీదుగా, రోడ్డు పక్కల నుంచి కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
గ్రామానికి గతంలో ఉదయం నుండి రాత్రి 8 గంటల వరకు 8 ట్రిప్పుల ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. ప్రస్తుతం గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో ప్రజలు, విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు నిర్మల్ వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. కావున గాంధీనగర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
గాంధీనగర్, లెఫ్ట్ పోచంపాడు గ్రామాలకు మిషన్ భగీరథ కింద కొత్త వాటర్ ట్యాంకుల ఏర్పాటు గురించి కూడా వినతి పత్రం అందించారు. అలాగే, గాంధీనగర్ గ్రామంలో కొత్త రేషన్ షాప్ మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. కావున పైన పేర్కొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని సర్పంచ్ ఆమని-బస్వరాజ్, గ్రామ ప్రజలు, మహిళలు, వీడీసీ సభ్యులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.











