
ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో కౌన్సిలర్ మేస పోసమ్మ, నాయకులు మేస సతీష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ శుక్రవారం ఆకస్మికంగా క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వార్డులో నెలకొన్న పిచ్చి మొక్కలు, డ్రైనేజీ సమస్యలు, మట్టి తొలగింపు వంటి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.


















