
నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో కీలక పాత్ర పోషించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, తమ పార్టీ మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 37 రోజులపాటు సాగిన ఆందోళనలకు మద్దతు అందించడం వల్లే యువతకు ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్టు చేశారు.



















