
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టాన్ని పరిరక్షించాలని, కూలీలకు మెరుగైన వేతనాలు, పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.



















