
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకుండా, ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.



















