
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ఈబీడీ గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద, కులమతాలకు అతీతంగా భక్తులు సామూహిక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. అనంతరం, సామూహిక వనభోజనాలు చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, వర్షాకాలంలో మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, నల్ల మేకల పండుగను జరుపుకున్నారు.



















