
షాద్నగర్ శివారులోగల సర్వే నంబర్ 364లో ఉన్న బీరప్ప, యెల్లమ్మ, మహంకాళి దేవాలయాలను ధ్వంసం చేసిన ఘటనపై షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సురేష్ కుమార్ అగర్వాల్కు చెందిన వ్యవసాయ భూమిలో ఉన్న ఈ దేవాలయాలను తొలగించబోమని హామీ ఇచ్చినా, కొద్దికాలం క్రితం పునర్నిర్మాణ పనులు అడ్డుకుని, ఇటీవల పునాదులను, చిన్న బీరప్ప ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు అందింది.



















