
నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర్ మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రాచీన బ్రహ్మేశ్వర్ ఆలయ ప్రాంగణంలో 9వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం మధ్యకాలానికి చెందిన అరుదైన నాగవీరుడు, భైరవుడు, వీరగల్లు, లజ్జాగౌరీ వంటి విగ్రహాలు, శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతం బౌద్ధ, జైన, శాక్తేయ, భైరవ సంప్రదాయాలకు కేంద్రంగా విలసిల్లిందని చరిత్ర పరిశోధకులు తెలిపారు.



















