
తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు వేసవి సెలవుల షెడ్యూల్ను కూడా ప్రకటించింది.



















