
దేశవ్యాప్తంగా రైతులకు అత్యాధునిక సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'భారత్-విస్తార్' (Bharat-VISTAAR) పేరుతో ఒక వినూత్న ప్రాజెక్టును మంగళవారం అధికారికంగా ప్రారంభించనుంది. కృత్రిమ మేధ (AI) సహాయంతో రైతులు తమ సొంత భాషల్లో వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని సులభంగా పొందగలిగేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడింది.



















