
ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులపై ప్లాట్ఫామ్ టికెట్ లేదనే కారణంతో జరిమానాలు విధించవద్దని, వేధించవద్దని జార్జిరెడ్డి , విద్యార్థి సంఘాల ప్రతినిధులు రైల్వే స్టేషన్ మేనేజర్ను కోరారు. ఈ సమస్యపై వారు మేనేజర్తో చర్చించి, విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


















