
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, సారంగాపూర్ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని నర్సరీలను గ్రామ సర్పంచులు, పాలక సభ్యులు, సిబ్బంది శనివారం సందర్శించి, నర్సరీల్లో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచనలు చేశారు. వాతావరణ సమతుల్యతకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా వారు తెలిపారు.



















