
ప్రకృతితో మమేకం కావడమే మానవాళికి రక్షణ అని, బోనాల పండుగ అంటే ప్రకృతిలో భాగమైన మట్టి, నీరు, పాడి, పంటలకు అమ్మవారి రూపంలో దండం పెట్టుకోవడమేనని సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ. పోశన్న అన్నారు. ప్రకృతిని గౌరవిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.



















