
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా నెలకొంది. పట్టణంలోని పలు పెట్రోల్ బంకులలో ఇంధనం కోసం వాహనదారులు, రైతులు గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా నెలకొంది. పట్టణంలోని పలు పెట్రోల్ బంకులలో ఇంధనం కోసం వాహనదారులు, రైతులు గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణ రక్షణ సేనలో చేరికలు ఊపందుకున్నాయి. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో పలువురు యువకులు, నాయకులు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. బోత్ నియోజకవర్గం నుంచి పలువురు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బానోత్ వసంతరావు కూడా ఈ చేరికల్లో పాల్గొన్నారు.

దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటిపిఎస్) లో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంపై మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) సోమవారం పర్యటించి, అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్, వాల్వ్లు దెబ్బతిన్నాయని, అయితే ప్రధాన యంత్రాలకు నష్టం జరగలేదని తెలిపారు.

భైంసా పట్టణంలోని స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై స్థానిక యువ నాయకుడు కంబ్లే సాహెబ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అంత్యక్రియలు నిర్వహించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నిర్మల్ పట్టణంలో ప్రజలను వేధిస్తున్న కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా, ఆదివారం పింజరి గుట్ట ప్రాంతంలో 86 కోతులను పట్టుకున్నారు.

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా 'ఫిట్ & యాక్టివ్ తెలంగాణ' కార్యక్రమంలో భాగంగా కుంటాల మండల కేంద్రంలో సోమవారం ఉదయం మరాథాన్ రన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజబాపు తెలిపారు. జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి, ఇంధన పొదుపు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కుంటాల మండలం, పెంచికల్ పాడ్ గ్రామానికి చెందిన సూర్యవంశం సాయినాథ్ వినూత్నంగా సైకిల్ యాత్ర చేపట్టారు. తన వృత్తి రీత్యా రోజుకు 34 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణిస్తూ, ఇంధన ఆదా ఆవశ్యకతను తెలియజేస్తున్నారు.

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా టాపర్లుగా నిలిచిన పీఎం శ్రీ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్, కుంటాల విద్యార్థినులను నిర్మల్ జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా, డీఈఓ భోజన్న ఘనంగా సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు.

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా టాపర్లుగా నిలిచిన పీఎం శ్రీ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్, కుంటాల విద్యార్థినులను నిర్మల్ జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా, డీఈఓ భోజన్న ఘనంగా సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు.

తమిళనాడులోని చెన్నై నుండి ప్రారంభమైన రాజీవ్ మెమోరియల్ జ్యోతి యాత్రకు ఆదివారం నిజామాబాద్లో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్పల్లి గ్రామంలో ఆదివారం జరిగిన మాజీ ఎంపీపీ గిర్దావర్ గంగారెడ్డి తల్లి పెద్దోళ్ల సాయమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావుతో పాటు పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు హాజరయ్యారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆపిసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య వైద్య సేవా కార్యక్రమం ప్రజల మన్ననలు పొందింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు, క్లబ్ చేస్తున్న సేవలను ప్రశంసించారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్పల్లి గ్రామంలో ఆదివారం జరిగిన మాజీ ఎంపీపీ గిర్దావర్ గంగారెడ్డి తల్లి పెద్దోళ్ల సాయమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు హాజరై, సాయమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.

కుంటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా విజయోత్సవ వేడుకల్లో భాగంగా, IPE-2026లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, విశిష్ట ప్రతిభ కనబరిచిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.

పదేళ్లు మంత్రిగా ఉన్నా నిర్మల్ అభివృద్ధికి ఏమీ చేయలేదని, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

నిర్మల్ డిపో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టి. ఎం.యు.) కార్యవర్గ ఎన్నిక ఆదివారం నాడు నిర్వహించబడింది. ఈ ఎన్నికలో కె. హన్మంతు డిపో అధ్యక్షులుగా, పి. నారాయణ సెక్రటరిగా ఎన్నికయ్యారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండల పరిధిలోని శివపురం ప్రాంతంలో ఇంట్లో చొరబడి సుమారు 6 తులాలకు పైగా బంగారు ఆభరణాలను దొంగిలించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కుబీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం 'విద్య విజయోత్సవం' పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు.