
పదవ తరగతి పరీక్షలలో విశేష ప్రతిభ కనబరిచిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బైంసాలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాంపల్లి భూషణ్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఆయన సూచించారు.



















