
యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపునకు క్రీడలు దోహదం చేస్తాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి (బీఎల్ఆర్) పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహించిన జీపీఎల్ సెషన్ 2 క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది.



















