
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)ను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ఓటర్లు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.



















