
కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణలో సత్తా చాటాలని భావించిన కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ అనే పేరుపై అభ్యంతరాలు రావడంతో ఆ పార్టీ పేరును కేటాయించలేమని ఈసీ ఆమెకు లేఖ రాసింది. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాలని ఆదేశించింది.

కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణలో సత్తా చాటాలని భావించిన కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ అనే పేరుపై అభ్యంతరాలు రావడంతో ఆ పార్టీ పేరును కేటాయించలేమని ఈసీ ఆమెకు లేఖ రాసింది. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాలని ఆదేశించింది.

సాగునీటి సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయనతో పాటు బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్రావు తీవ్రంగా ఖండించారు.

భైంసా పట్టణంలోని గణేష్నగర్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పుట్టపోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని రైతులు, ప్రజలు అమ్మవారిని వేడుకున్నారు.

హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తున్న వలస కార్మికుల పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం 'వర్క్ సైట్ స్కూళ్లను' ప్రారంభించింది. నర్సింగిలోని పారిశ్రామిక ప్రాంతంలో మొదటి పాఠశాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, మున్సిపల్ కమిషనర్ జి. శ్రీజన ప్రారంభించారు. విద్యాశాఖ, పురపాలక శాఖ, రాజపుష్ప ప్రాపర్టీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. వీరంతా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విజయవాడ మీదుగా హైదరాబాద్ వైపు కారులో వెళ్తుండగా, వెనుక నుండి వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్లోని తిరుమల పుణ్యక్షేత్రంలో ఒక అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. 116 ఏళ్ల వయసున్న వృద్ధురాలు, శ్రీవారిని దర్శించుకోవాలనే అచంచలమైన భక్తితో కాలినడకన తిరుమల మెట్లు ఎక్కారు. ఆమె దృఢ సంకల్పం, మనోబలం, శారీరక దృఢత్వం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

డైరెక్టర్లు పూలమొల్ల నాగేందర్ రెడ్డి, గోపిడి గంగారెడ్డి

శ్రీ గురుభ్యోనమః. 05-07-2026 ఆదివారం నాడు మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారికి సంబంధించిన రాశిఫలాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈరోజు మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, గృహంలో శుభకార్యాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం వంటివి మేషరాశి వారికి అనుకూలిస్తాయి. వృషభ రాశి వారికి రుణాల ఒత్తిడి, జీవిత భాగస్వామితో వివాదాలు, పని ఒత్తిడి వంటివి ఉంటాయి.

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, శిలాతోరణం వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు సుమారు 18 నుండి 20 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

అడవుల నరికివేత వల్ల కలిగే తీవ్ర పరిణామాలపై, ముఖ్యంగా ఆకలి, రైతు సమస్యలపై రచయిత్రి మంజుల పత్తిపాటి లోతైన విశ్లేషణ చేశారు. అడవి నరికితే ఆకలి పెరుగుతుందని, ఆవాసం కోల్పోయిన జీవులు పొలాలపై ఆధారపడాల్సి వస్తుందని, దీనికి బాధ్యులెవరని ఆమె ప్రశ్నించారు.

కళ్లెం శ్రీనివాస్ రెడ్డిలకు ఘన సన్మానం

నూకల చారిటబుల్ ట్రస్ట్, ఎన్వీఆర్, బీ ఎల్ఆర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జరిగిన వేసవి శిక్షణల్లో రాణించిన క్రీడాకారులను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సన్మానించారు. శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పలు పతకాలు సాధించడంతో పాటు జాతీయస్థాయికి ఎంపికయ్యారు.

నూకల చారిటబుల్ ట్రస్ట్, ఎన్వీఆర్, బీ ఎల్ఆర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జరిగిన వేసవి శిక్షణల్లో రాణించిన క్రీడాకారులను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సన్మానించారు. శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పలు పతకాలు సాధించడంతో పాటు జాతీయస్థాయికి ఎంపికయ్యారు.

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో సామాజిక దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేయాలని మిర్యాలగూడ యాదవ ఉద్యోగుల సంఘం, పట్టణ అధ్యక్షులు గుడిపాటి కోటయ్య యాదవ్, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్ లు పిలుపునిచ్చారు. శనివారం దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ సాయి మహేశ్వర ఫర్టిలైజర్, కిసాన్ సీడ్స్ ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి వి.వినోద్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయ విధానం, ధరల పట్టికలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, ఇతర రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మి్యాలగూడ మున్సిపాలిటీ పిధిలో 23 కొత్త పొదుపు సంఘాలను ఏ్పాటు చేయడానికి ప్భుత్వం అనుమతి మంజూు చేసిందని మున్సిపల్ కమిషన్ న్ా శ్ీజాడ్డి తలిపాు. పట్టణస్థాయి బ్యాంక్ల కమిటీ సమావేశం శనివాం ని్వహించిన సంద్భంగా ఆమ ఈ వివాలు వల్లడించాు. ఈ సంద్భంగా బ్యాంకు లింకేజీ కింద 350 సంఘాలకు 50.70 కోట్ల ూపాయల లక్ష్యాన్ని ని్దేశించినట్లు తలిపాు.

మి్యాలగూడ మున్సిపాలిటీ పిధిలో 23 కొత్త పొదుపు సంఘాలను ఏ్పాటు చేయడానికి ప్భుత్వం అనుమతి మంజూు చేసిందని మున్సిపల్ కమిషన్ న్ా శ్ీజాడ్డి తలిపాు. పట్టణస్థాయి బ్యాంక్ల కమిటీ సమావేశం శనివాం ని్వహించిన సంద్భంగా ఆమ ఈ వివాలు వల్లడించాు. ఈ సంద్భంగా బ్యాంకు లింకేజీ కింద 350 సంఘాలకు 50.70 కోట్ల ూపాయల లక్ష్యాన్ని ని్దేశించినట్లు తలిపాు.

రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్), ఎమ్మెల్సీ కె.శంకర్ నాయక్ లతో కలిసి శనివారం దున్నపోతుల గండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, నాణ్యత, వేగం, సాంకేతిక అంశాలపై అధికారులతో సమీక్షించారు.

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్మల్లోని గౌతమ్ మోడల్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మున్సిపల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొని మొక్కలు నాటారు. స్వచ్ఛమైన, హరిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో, శ్రీకృష్ణ కురుమ యాదవ సంఘం సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.