
బైంసా పట్టణంలోని బుద్ధ విహార్ (టెక్డి)లో ఆదివారం జరిగిన బుద్ధ వందన కార్యక్రమానికి బౌద్ధ ఉపాసకులు, ఉపాసికలు, చిన్నారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విద్యనభ్యసించాలని ప్రముఖులు సూచించారు.



















