
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, సంస్థ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను మంగళవారం బోథ్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దండోరా జెండాను ఆవిష్కరించారు. 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ప్రారంభమైన దండోరా ఉద్యమం లక్ష్యం రాజ్యాంగబద్ధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం సాధించడమేనని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ తెలిపారు.



















