
తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి, వనమహోత్సవంలో మొక్కలు నాటనున్నారు.



















