
బోథ్ పట్టణంలో వనమహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం సాయి నగర్ కాలనీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి కుర్మే అన్నపూర్ణ మహేందర్, ప్రతి కుటుంబం మొక్కలు నాటి సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని నాయకులు ఉద్ఘాటించారు.



















