
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో గ్రామస్థులు సామాజిక మార్పునకు దారితీసే కీలక తీర్మానాలు చేశారు. పటేల్ మేస్రం వేంకట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, కట్నం తీసుకోవడాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు, వివాహ వేడుకల్లో మద్యం సేవించరాదని నిర్ణయించారు.



















