
లోకేశ్వరం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా జి. నరేష్, భైంసా పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా శరత్ డోంగ్రేలను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ సందర్భంగా భైంసాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన లోకేశ్వరం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు జి. నరేష్ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పటేల్ శాలువాతో ఘనంగా సన్మానించారు.



















