
జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసే బీబీ రాంజీ చట్టాన్ని తక్షణమే రద్దుచేసి, ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కూలీల వేతనాలు పెంచాలని, బకాయిలు విడుదల చేయాలని ఆయన కోరారు.



















