
నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ (అగ్రికల్చర్ గోదాం) నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని భద్రపరచడానికి ఈ గోదాం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.



















